ప్రతి ఒక్కరు లేబర్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి
ప్రభుత్వ ఉద్యోగులు కానీ వారంతా కార్మికులు మరియు కూలీలు వెంటనే లేబర్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి దానితో మీకు లాభాలు కలుగుతాయి అని చెప్పారు.
ఈరోజు అజాధిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసి యువకులకు మరియు మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈకార్యక్రమంలో లాయర్ వొజ్జెల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి అలాగే చట్ట పరమైన ఇబ్బందులు భూతగాదాలు, ఆస్తి గొడవలు, కుటుంబ సమస్యలు మరియు వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి సమస్యలు ఏమైనా వుంటే మండల్ లీగల్ సర్వీస్ సేవలు వినియోగించుకోవాలి అని అన్నారు. ఇంకా మహిళలకు ఏమైనా సమస్యలు ఉంటే సఖీ 181 సేవలు కూడా వారికి ఉచిత న్యాయ సహాయం దొరుకుతుంది అని ఈ కార్యక్రమంలో PLV కోట శివకుమార్ మరియు సర్పంచ్ చౌట్ పెల్లి లావణ్య, ఉప సర్పంచ్ నేరెళ్ల శ్రీధర్, యం.పి.టి.సి తుమ్మల పుష్ప మరియు న్యాయవాదులు సుమలత, నవీన్ రెడ్డి మరియు అంగన్వాడి, ఆశ కార్యకర్తలు మహిళ సంఘాల మహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
|